తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆరా్ఎస్) గా కేసిఆర్ మార్చిన సంగతి తెలిసిందే. పార్టీ గుర్తు మార్పునకు గానూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కేసిఆర్ లేఖ పంపారు. పార్టీ ప్రతినిధి బృందం నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం కాపీతో పాటు పార్టీ అధినేత కేసిఆర్ లేటర్ ను అందజేసింది. బీఆర్ఎస్ ద్వాారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసిఆర్ భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ను ఎన్నికల సంఘం గుర్తింపు కొత్త తలనొప్పి వచ్చేలా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొద్దిగా పేరు మార్పుతో బీఆర్ఎస్ పేరుతో నాలుగు పార్టీల ధరఖాస్తులు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లో ఉండటం సమస్యకు కారణంగా తెలుస్తొంది.
సికింద్రాబాద్ నుండి బహుజన రాష్ట్ర సమితి ఉండగా, గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుండి ఓడ గుర్తుతో ఈ పార్టీ పోటీ చేసింది. ముంబై నుండి బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ, పూణె నుండి భారతీయ రాష్ట్రాయ స్వదేశీ పార్టీ ల ధరఖాస్తులు ఇప్పటికే ఈసీ వద్ద ఉండగా, తాజాగా భారత్ రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) ధరఖాస్తు తోడైయ్యింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసే సమయంలో బీఆర్ఎస్ అనే పేరు ఓటర్లను ఆయోమయానికి గురి చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తు బ్యాలెట్ పై ఉండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసిన సమయంలో కేసిఆర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీగా ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ పూర్తి పేరు వేరువేరుగా ఉన్నప్పటికీ షార్ట్ కట్ గా అన్నీ బీఆర్ఎస్ గానే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది.
చదుకున్న వాళ్లు మంత్రులు కూడా పార్టీ పేరు విషయంలో తికమక పడే అవకాశాలు ఉన్న ప్రస్తుత రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ పేరుతో రెండు మూడు పార్టీల అభ్యర్ధులు పోటీలో ఉంటే ఆయోమయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ గా టీఆర్ఎస్ మంత్రే కేసిఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ కు బదులుగా బీఎస్పీ అంటూ సంభోధించి విమర్శల పాలైయ్యారు. ఇలా మంత్రులే బీఆర్ఎస్ కు బీఎస్పీకి తేడా తెలియకపోతే అదే పేరుతో మూడు నాలుగు పార్టీలు ఉంటే సామాన్యులు తికమక పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ పార్టీ ల గుర్తింపు విషయంలో ఎన్నికల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేసిఆర్ సర్కార్ కు షాక్ ఇస్తున్న వైఎస్ షర్మిల .. నేడు సీబీఐ డైరెక్టర్ తో భేటీ