KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలు అమలు చేసే కేసీఆర్ తాజాగా వెలువరించిన ఆదేశాలు ఏకంగా టీఆర్ఎస్ నేతలకే షాక్లాగా మారాయని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్లు, ముఖ్య నేతలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల విషయంలో గులాబీ దళపతి బ్యాడ్ న్యూస్ చెప్పారు. అదే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి నో చెప్పడం.
Read More: KCR: గవర్నర్ నరసింహన్ కేసీఆర్కు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
హాట్ టాపిక్ సీట్లు…
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3వ తేదీన ముగిసింది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు అప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ కొంతకాలం వాయిదా వేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నాలుగు రోజుల క్రితం లిఖితపూర్వకంగా కోరింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక సమాచారం ఇచ్చారు.
Read More: KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
ఇప్పుడే ఎన్నికలు పెట్టలేం
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదని, అందువల్ల మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రోజుల పాటు ఎన్నికల నిర్వహణను వాయిదా వేయడం ఉత్తమమని, ప్రస్తుతం నిర్వహించాలనే అభిప్రాయంతో లేమని రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది.