KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక స్కీం ప్రారంభించనున్నారు. తన సర్కారు ప్రారంభిస్తున్న స్కీంను హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో లాంచ్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త గేమ్ మొదలుపెట్టనున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read More:KCR: హుజురాబాద్లో కేసీఆర్ స్కెచ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు
ఇది నిర్ణయం…
“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అమలును ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు.“అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Read More:KCR: మోడీపై ఎందుకు ఈ మౌనం కేసీఆర్ సాబ్?
అక్కడి నుంచే ఎందుకంటే…
“ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ…‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారు.“ అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం వెనుక లాజిక్ ఉప ఎన్నికేనని పలువురు పేర్కొంటున్నారు.