KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ల పరంపర కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వస్తుండటమో లేక మరే కారణమో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా ఆయన ప్రభుత్వపరంగా కీలకమైన ఆదేశాలు వెలువరిస్తున్నారు. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు. అదే కొత్త రేషన్ కార్డుల జారీ.
Read More: KCR: ఏపీ ప్రజలకు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…
రేషన్ కార్డులు జారీ..
పౌర సరఫరాల శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు దాకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సిఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Read More: KCR: కేసీఆర్ నోటి వెంట ఆ మాట తప్ప మరోటి రావట్లేదుగా…
ఉద్యోగాలపై అదే మాట…
తాజాగా ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతోపాటుగా నూతన జోన్లు ఆమోదం పొందినందున త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్ (టాస్క్)ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు.