KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత గుడ్ న్యూస్ మళ్లీ చెప్పారు. ‘త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏడు నెలలైతున్నా అతీగతీ లేదన్న విమర్శల నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై క్లారిటీ రావడం, జోనల్ వ్యవస్థ కు కేంద్రం ఆమోద ముద్ర వేసినందున కొలువుల నోటిఫికేషన్లు విడుదల చేయాలని తాజాగా రాష్ట్ర అధికారులకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
Read More: KCR: ఉప ఎన్నికకు అప్పుడే ఎత్తుగడ వేసేసిన కేసీఆర్
కేసీఆర్ పై ఆ విమర్శ….
మూడేళ్లుగా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులకు వయసు మించిపోయింది. మరెందరో ఈ పరిస్థితికి దగ్గరగా ఉన్నారు. అయితే, జోనల్ వ్యవస్థకు ఇంకా ఆమోద ముద్ర పడకపోవడం వల్లే నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని సర్కారు తప్పించుకునే ప్రయత్నం చేసింది. జోనల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో జోనల్ అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోయాయి. గెజిట్ విడుదలై రెండున్నర నెలలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. కేవలం 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకుంది.
Read More: KCR: కేసీఆర్కు ఇంత కులపిచ్చి ఉందా?
తాజాగా కేసీఆర్ కీలక నిర్ణయం…
ముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ , తర్వాత ప్రమోషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టత ఇచ్చారని సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. తొలివిడతలో ఈ యాభై వేల కొలువుల భర్తీ ఉంటుందని తర్వాతి విడుతలో మిగతా కొలువులు ఉండేలా అధికారులు సన్నద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.