KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు నేటి నుంచి మరో తీపి కబురు అందించనున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. ప్రజాప్రతినిధులు జిల్లాలోని ఆయా చోట్ల లబ్ధిదారులకు రేషన్కార్డులను అందించి రూ. 14 కోట్ల విలువైన బియ్యాన్ని సైతం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read More : KCR: మోడీ కంటే కేసీఆర్ తోపు అంటున్న కోదండరాం
వేగంగా పనులు…
రాష్ట్రంలో రేషన్ కార్డు ల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఈ నెలలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి మండలి సంబంధిత అధికారులను ఆదేశించింది. దానికి తగినట్లుగానే అధికారులు యుద్ధప్రాతిపదికన కృషి చేసి సర్వం సిద్ధం చేశారు.
Read More : KCR: కేసీఆర్కు హుజురాబాద్ భయం పట్టుకుంది.. . దానికి ఉదాహరణ ఇదే!
కేసీఆర్ కీలక నిర్ణయం..
ఇటీవలే కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాలశాఖపై మంత్రి గంగుల కమలాకర్, అధికారులతో సీఎం కేసీఆర్ మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లింగ్ సామర్థ్యం పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇతర అంశాలపై సీఎం చర్చించారు. జూలై 26 నుంచి 31వ తేదీ దాకా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీతో రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఇందుకోసం ప్రభుత్వం రూ. 2,766 కోట్లను వెచ్చించనుంది.