KCR: తెలంగాణలో 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ విజయం సాధించింది. సెంటిమెంట్ ను రగిల్చగలిగింది. అందుకే వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఊపుతో 2023లో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నది అన్న సమాచారం. ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అందుకే పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థలు, రకరకాల సర్వే సంస్థలు, జాతీయ మీడియా సంస్థలు కూడా తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ పెట్టాయి. సహజంగా ఎన్నికలు అంటే సర్వేలు ఉంటాయి. ప్రజాభిప్రాయ సేకరణలు జరుగుతుంటాయి. తాజాగా చాణిక్య సర్వే సంస్థ జిల్లాల వారిగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది వెల్లడించింది.
KCR: చాణిక్య సర్వే సంస్థ లెక్కలు ఇవీ
చాణిక్య సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు 2. కాంగ్రెస్ కు నాలుగు, బీజేపీకి నాలుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 2, బీజేపీ 4, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 4, బీజేపీ 4, ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ 5. కాంగ్రెస్ 3, బీజేపీ 2, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 6, బీజేపీ 4. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 0. బీజేపీ 3, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 9, బీజేపీ 3, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 10, ఉమ్మడి వరంగల్లు జిల్లాలో టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 9, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ 3, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుస్తాయని చెప్పింది.
KCR: టీఆర్ఎస్ కి 33 స్థానాలు
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 5, బీజేపీ 3తో పాటు ఎంఐఎం ఏడు స్థానాలు కైవశం చేసుకుంటుందని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంఐఎంకు ఏడు. బీజేపీ 22, కాంగ్రెస్ 55, టీఆర్ఎస్ 33 స్థానాలు గెలుస్తాయని ఈ సర్వే సంస్థ లెక్కలు చెప్పింది. బీజేపీకి చెప్పిన సీట్లు ఇంచు మించుగా కరెక్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే 30 నుండి 35 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాదు ఈ మూడు జిల్లాలో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆదిలాబాద్, వరంగల్లు జిల్లాలోనూ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?