KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఉప ఎన్నిక వేళ ఉన్నతాధికారుల బదిలీ చర్చనీయాంశంగా మారుతోంది. కరీంనగర్ కలెక్టర్ శశాంకను ఇటీవలే బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా పోలీస్ కమిషనర్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read More : KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
కలెక్టర్ పై వేటు…
కరీంనగర్ కలెక్టర్ శశాంకను బదిలీ చేస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అదే విధంగా తాజాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలహాసన్ రెడ్డిని బదిలీ చేసేసింది. ఈ మేరకు పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమలహాసన్ స్థానంలో రామగుండం సీపీగా పనిచేస్తున్న సత్యనారాయణను నియమించింది. అటు రామగుండం పోలీస్ కమిషనర్గా రమణకుమార్ను నియమిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరంగా పోలీస్ కమిషనర్కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొంది.
Read More : Eatela Rajendar: కేసీఆర్ స్కీం పెట్టినందుకు ఈటల కు పాలాభిషేకం చేశారు!
కేసీఆర్ నిర్ణయాల వెనుక లెక్క ఏంటో…
ముందు కరీంనగర్ కలెక్టర్, తాజాగా పోలీస్ కమిషనర్ ను బదిలీ చేసిన ప్రభుత్వం వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చకు తెరలేపింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేస్తూ ఉంటుంది. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో నోటిఫికేషన్ రాకముందే ప్రభుత్వమే అధికారులను బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?