KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసే ప్రతి అవకాశాన్ని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ సద్వినియోగం చేసుకుంటుందనే సంగతి చెప్పనక్కర్లేదు. పైగా , కీలక సమయంలో సహజంగానే ఆ దూకుడు మరింత పెంచుతుంటారు. తాజాగా కరోనా సమయంలో బీజేపీ తమ దాడిని మరింతగా పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా ఆ పార్టీ నేత బీజేపీ సైతం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు.
బండి సంజయ్ ఏమంటున్నారంటే…
తెలంగాణ సీఎం కేసీఆర్కు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదని బండి సంజయ్ అన్నారు. 20 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది… రానున్న 3 రోజుల్లో మూడు లక్షల డోసులు రానున్నాయన్నారు. తెలంగాణకు వచ్చిన వ్యాక్సిన్ డోసులు 6141040, పంపిణీ చేసిన డోసులు 5447805 అని పేర్కొన్న బీజేపీ ఎంపీ ఆరు లక్షల డోసులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్ పంపిణిని ఆపిందని ఫైర్ అయ్యారు. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారని ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడానికి కారణమేంటీ ? అని ప్రశ్నించారు.
విజయశాంతి కూడా…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వలే తెలంగాణ సర్కార్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేంద్రం కరోనా డోసులు ఇచ్చినప్పటికీ ప్రజలకు ఇవ్వడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. “కోవిడ్ కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు… రెండెసివర్ ఇంజెక్షన్లను 10 వేలకు పెంచినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. “ అంటూ తమ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. `రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సీన్ డోసుల నిల్వ ఉన్నా గత 3 రోజుల నుంచీ వాక్సినేషన్ ఆపేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు…. ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదు. కరోనా కట్టడిపై తెలంగాణ సర్కారు తీరిది. ` అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై సర్కారు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనాకు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పాలకులు చురుకుగా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని విజయశాంతి పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?