KCR:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపికబురు తెలిపారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ వచ్చింది.
రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల ప్రకారం జోనల్ జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. దీంతో 50000 ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రావడమే మిగిలింది.
Read More: KCR: కేసీఆర్ అవాక్కయ్యేలా చేస్తున్న కాంగ్రెస్
కేసీఆర్ గుడ్ న్యూస్…
త్వరలో 50000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం తాజాగా ఆదేశాలు ఇచ్చారు. మల్టీ జోన్ –1 పరిధిలో తొలి జోన్ కాళేశ్వరం జోన్లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా రెండో జోన్ బాసర జోన్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు, మూడో జోన్ రాజన్న సిరిసిల్లలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు, నాల్గో జోన్ భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలున్నాయి. ఇక మల్టీజోన్ –2లో ఐదో జోన్ యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు, ఆరోజోన్ చార్మినార్లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు, ఏడో జోన్ జోగుళాంబలో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి.
Read More: Revanth Reddy: కేసీఆర్ కంటే ముందు… కాంగ్రెస్ నేతల సంగతి చూస్తున్న రేవంత్
పోలీస్ కొలువుల విషయంలో…
పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మల్టీజోన్ –1లో తొలి కాళేశ్వరం జోన్లో జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు జిల్లాలు, రెండో జోన్బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, జగిత్యాల జిల్లాలు, మూడో జోన్ రాజన్నలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, నాల్గో జోన్ భద్రాద్రిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉంది. మల్టీజోన్–2లో ఐదో జోన్ యాదాద్రిలో సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఆరో జోన్చార్మినార్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు, ఏడో జోన్ జోగుళాంబలో మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్ల సవరణపై సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?