Eatela Rajendar: తెలంగాణలో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అసైన్డ్ భూముల ఆరోపణల తర్వాత ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో హుజురాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికకు ఇప్పటికే ఈటల సిద్ధమైపోయారు. నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అయితే, దాదాపు 2 దశబ్దాల పాటు హుజురాబాద్ లో తిరుగులేని నేతగా ఉన్న ఈటల వంటి బలమైన నేతను తట్టుకుని గెలిచే సత్తా ఉన్న లీడర్ కోసం గులాబీ బాస్ కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు.
Read More: Eatela Rajendar: కొత్త గేమ్ మొదలుపెట్టిన ఈటల… వర్కవుట్ అవుతుందా?
ఈటల విషయంలో కేసీఆర్…
తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించడం, ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం, కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు సరసన నిలబడిన నేతగా ఈటల రాజేందర్ ఎదిగారు. అంతటి లీడర్ ను ఢీ కొట్టాలంటే ఎవరైతే సరిపోతారన్న విషయంలో ఇంకా కన్ క్లూజన్ కు రాలేకపోతున్నారు. ఈటల స్థానాన్న భర్తీ చేయగల సత్తా ఎవరికుందనే కోణంలో ఒకటికి రెండుసార్లు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నా.. ఏ పేరు దగ్గరా ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి చెందడం లేదని తెలుస్తోంది.
Read more: KCR: కేసీఆర్ అవాక్కయ్యేలా చేస్తున్న కాంగ్రెస్
ఆయన పేరే ఎక్కువగా…
హుజురాబాద్ లో గులాబీ పార్టీ తరపున బరిలోకి దింపేందుకు ఇప్పటికే అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. వీరిలో ఎక్కవగా వినిపిస్తోన్న పేరు మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్. ఈయనను పోటీలో నిలపాలన్న ప్రతిపాదన జిల్లా నేతల ద్వారా సీఎం కేసీఆర్ కు మొదట్లోనే వెళ్లింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులతో ప్రయోగాలు చేసే కంటే ఈటలను ఢీకొనేందుకు దీటైన అభ్యర్థినే రంగంలోకి దింపాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ , బీజేపీల నుంచి టీఆర్ ఎస్ లో చేరి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వలస అభ్యర్థుల కంటే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తేనే బాగుంటుందని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో హుజురాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండటం మరో కారణంగా పేర్కొంటున్నారు.