జూబ్లిహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పబ్ లో పార్టీకి వచ్చిన ఓ మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి అయిదుగురు మైనర్ బాలురు, ఒక మేజర్ సామూహిక అత్యాచారం పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజకీయ నేతల పిల్లలు నిందితులుగా ఉండటంతో తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అందరు నిందితులను అరెస్టు చేయడం, మైనర్ బాలురలను జూవైనల్ హోమ్ కు, మేజర్ ను జైలుకు తరలించారు.
జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పక్కా సాక్షాధారాలతో చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
అయితే మైనర్ బాలురు తీవ్రమైన నేరానికి పాల్పడినందున వారిని మేజర్ లుగా గుర్తించాలని ఆనాడే పోలీసులు జూవైనల్ జస్టిస్ బోర్డుకు లేఖ రాశారు. అయితే జూవైనల్ జస్టిస్ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో తెలంగాణ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అత్యాచారానికి పాల్పడిన అయిదుగురి మెచ్యురిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నందున వారిని మేజర్ లుగా పరిగణించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిందితులకు మేజర్లకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు శాఖ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు త్వరలో విచారించనున్నది.