ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు సర్టిఫైడ్ అర్డర్ కాపీ అందడంతో కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కేసు వివరాలను అందించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. సీబీఐ రంగంలోకి దిగకముందే హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ ను ఆశ్రయించింది.
ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిసాయి. ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారనీ, దీనిపై పార్టీ అధ్యక్షుడు గా సీఎం కేసిఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం తప్పులేదని కోర్టుకు విన్నవించారు. అనంతరం ప్రతివాదుల వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో ధర్మాసనం తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.
తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ ఇది
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?