Kodandaram: తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్ర సాధన దిశగా నడింపిచిన అతి ముఖ్యమైన నేతల్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలంగాణ జన సమితి పేరుతో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసిన ఆయన ఈ గోదాలో గెలుపు సాధించలేకపోయారు. ముఖ్య నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే, తాజాగా మళ్లీ ఫాంలోకి వచ్చేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తాజాగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
Read More : Kodandaram: కత్తులు దూస్తున్న కోదండరాం… షాకులు ఇస్తున్న సొంత టీం…
కోదండరాం దీక్ష…
నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం సహా పలువురు నేతలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దీక్షకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు టీజేఎస్ పార్టీ నేతల సత్యాగ్రహ దీక్ష కొనసాగింది. దీక్ష సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రంగానికి ప్రధాన వనరు ఇంధనం అని, అలాంటి ఇంధనాన్ని ప్రభుత్వం తక్కువ ధరకు ఇవ్వకపోతే దేశ ప్రజలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేమన్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా లీటరు పెట్రోల్ను రూ.50కి ఇవ్వొచ్చని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో అది పాలకుల వైఫల్యమని పేర్కొన్నారు.
Read More : KCR: మోడీ కంటే కేసీఆర్ తోపు అంటున్న కోదండరాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు….
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ పెట్రోల్ , డీజిల్పై పన్నుల మోత మోగిస్తున్నాయిన కోదండరాం ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రజలు జీవితం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి షాకిచ్చేలా మారిన పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపులో ప్రభుత్వాల తీరు సరైంది కాదని కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు.టీజేఎస్ తరఫున తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.