కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పూర్తి స్వరూపాన్ని మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే నానాటికీ దిగజారుతున్న పార్టీ పరిస్థితిని అంచనా వేస్తూ మొత్తం పార్టీని…. పిసిసి కూర్పు బలమైన నేతలతో నింపి అన్ని వర్గాలను సమతూకంగా ఉంచేలా చూస్తోంది. దీనిలో భాగంగా ఫైర్బ్రాండ్ నేతలుగా పేరున్న వారిని.. కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్ళిన విజయశాంతి డీకే అరుణ లాంటి మహిళా నేతలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్లో ఇప్పటివరకు కీలకంగా ఉన్న మహిళా నేతల గురించి ఆలోచిస్తోంది. పాత మొహాలు అన్నిటినీ పక్కనబెట్టి పూర్తిగా కొత్త వారితో నింపేందుకు కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉంది.
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి దాదాపుగా తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించాలనే నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. ఆయనకు సహకరించి అన్ని విధాలా పార్టీని ముందుకు నడిపించే.. అనుకూలంగా ఉండే నేతలకు తెలంగాణ పీసీసీలో కీలకమైన పదవులు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాత కాంగ్రెసు నాయకుల వల్ల కానిదాన్ని కొత్తగా పార్టీలోకి వచ్చినవారితో పీసీసీని ఏర్పాటు చేసి పార్టీని తెలంగాణలో బలోపేతం చేసి సాధించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తుది దశలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ పీసీసీపీఠం ఖాయమే.
మహిళ… బీసీ… ఫైర్ బ్రాండ్
తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి ఇటీవల పార్టీలోకి వచ్చిన వరంగల్ కు చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోందిది. పార్టీని వదిలిపెట్టిన డికె అరుణ, విజయశాంతిలకు ధీటుగా మహిళా నాయకురాలిని ముందు పెట్టాలనే ఆలోచనలో భాగంగానే కొండా సురేఖ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొండా సురేఖ… మహిళా నేతలకు అంతే దీటుగా సమాధానం చెప్పగలరు. మహిళా నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పార్టీ ఇమేజ్కు బలం చేకూరుతుంది.
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో తనను విస్మరించారని ఆవేదన చెందుతున్న సీతక్కను మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలి పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహిళా కాంగ్రెసు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
** కాగా, మహిళా అధ్యక్షురాలి పదవి కోసం సునీతారావు, సుజాత పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలిగా ఉన్న నేరెళ్ల శారదకు, మరో ేత ఇందిరా శోభన్ లకు కమిటీల్లో కీలక పదవులు అప్పగించే అవకాశం ఉంది. మైనారిటీ వర్గానికి చెందిన ఉజ్మా షకీర్ కు కూడా తగిన స్థానాన్ని కల్పించే అవకాశం ఉంది.