Koushik Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన యువ నేత కౌశిక్ రెడ్డికి స్వల్ప వ్యవధిలోనే తీపికబురు దక్కిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై అప్పుడే వివాదం మొదలైంది. ఈ నిర్ణయం పట్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : Koushik Reddy: టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డి.. అసలు మాట చెప్పని కేసీఆర్
కౌశిక్ రెడ్డికి గుడ్ న్యూస్…
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో ఉంటూనే టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నట్లు ఆయన కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో రికార్డింగులు వెలుగులోకి రావడంతో ఆయనే హుజూరాబాద్ అభ్యర్థి అన్న ప్రచారం జోరుగా సాగింది. వరుసగా రెండు ఆడియోలు బయటపడిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించి చర్యలకు ఉపక్రమించగా ఆయనే పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.
Read More : KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక.. కేసీఆర్ కు ఓ గుడ్ న్యూస్… ఇంకో బ్యాడ్ న్యూస్…
రాళ్ల దాడి చేసిన వ్యక్తికి…
కాగా, కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఫైరయ్యారు. తెలంగాణ ఉద్యమ కారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా ? మానుకోట యుద్ధంలో మేము అందరం కౌశిక్ రెడ్డి చేతుల్లో రాళ్ళ దెబ్బలు తిన్న వాళ్లమని తెలిపారు. ఒకరోజు ముందు పార్టీ కండువా కప్పి రాత్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కేసీఆర్ అని అన్నారు. శ్రీకాంత చారి తల్లి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు..?… 1200 మంది ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బొడిగె శోభ పేర్కొన్నారు.