Koushik Reddy: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్రెడ్డి గత కొద్దికాలంగా సంచలన రీతిలో వార్తల్లో నిలిచి ఇప్పుడు డైలమాలో పడ్డారా? అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ టికెట్ తనదే అని ప్రకటించిన కౌశిక్ కు భంగపాటు తప్పదా? అనే చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలు ఇందుకు కారణంగా మారుతున్నాయి.
Read More: Eatela Rajendar: హుజురాబాద్లో ఇంటెలిజెన్స్ సర్వే… ఈటల గురించి ఏం తేలిందంటే…
కౌశిక్ రెడ్డి కథ ఇది…
హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ఉన్న కౌశిక్ రెడ్డి ..ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత ఒక్కసారిగా పతాక శీర్షికల్లోకి ఎక్కారు.
కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే, రేవంత్కు టీపీసీసీ పగ్గాలు ఇవ్వడంతో ఆయన కూడా కొంత సందిగ్ధంలో పడ్డారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు టికెట్ దక్కుతుందనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో తనకు టికెట్ లభించదనే అనుమానంతో సైలెంట్ గా టీఆర్ఎస్ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరిపారు. ఇక ఈ క్రమంలోనే కౌశిక్రెడ్డి ఆడియో లీక్ కావడం అందులో ఆయన బీజేపీ కార్యకర్తతో టీఆర్ ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పడంతో కాంగ్రెస్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే సమయంలో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.
Read more: Koushik Reddy: కౌశిక్ రెడ్డి అమాయకుడా? తెలివైనోడా?
టీఆర్ఎస్ పార్టీలో అంతా రెడీ అయినా…
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరిగినా… ఆ మేరకు కండువా కప్పుకోవడం మాత్రం పెండింగ్లో పడుతోంది. జూలై 16వ తేదీన ఆయన టీఆర్ఎస్లో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ రోజు చేరిక జరగలేదు. దీంతో జూలై 21న కౌశిక్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ టికెట్ గురించి ఉన్న సందిగ్దత నేపథ్యంలో ఈ చేరిక జాప్యం అని పలువురు పేర్కొంటున్నారు.