KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారా? పార్టీ నేతల తీరుపై ఏకంగా క్లాస్ తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఓవైపు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం నడుస్తుండగా.. మరోవైపు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా సాగుతోంది. అయితే, పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
KTR ఎన్నికలపై స్పెషల్ ఫోకస్…
పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్.. ఇప్పటి వరకు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.. అసలు టార్గెట్.. పూర్తి చేయాల్సినదానిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సభ్యత్వం విషయంలో పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై ఆరా తీసిన ఆయన.. ఇప్పటికే సభ్యత్వ నమోదు సమయం అయిపోయిందన్నారు.. అయినా మీలో చలనం ఎందుకు లేదని ఆయన ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకో వారం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ఆదేశాలు కేటీఆర్ జారీ చేశారు.
ఆయనకు అదిరిపోయే పంచ్
ఓయూకు వస్తే.. ఉద్యోగాలపై చర్చకు సిద్ధమని మంత్రి కేటీఆర్కు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్రావు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆ సవాల్కు తగ్గట్టుగానే ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గరకు వచ్చిన రామచందర్ రావు చాలా సేపు కేటీఆర్ కోసం నిరీక్షించారు.. కేటీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీ కూడా వేయించారు. “నేను ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్నా.. మీరు ఎక్కడున్నారు కేటీఆర్ ?“ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు రామచందర్ రావు.. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని.. మరి దాని సంగతి ఏంటి? అని ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?