KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పుట్టినరోజు కేవలం టీఆర్ఎస్ పార్టీ వర్గాలనే కాకుండా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శుక్రవారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. సహజంగానే కేటీఆర్ పుట్టిన రోజు ఉండే సందడే వేరు. అయితే, తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ఓ కీలక పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Read More : KCR: కేసీఆర్ పాలనపై షర్మిల సెటైర్లు
కేసీఆర్ ఆర్డర్ వేశారు…
తెలంగాణలో మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ కీలక సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని , అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. వర్షాలు, సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో శనివారం తాను ఎవరిని కలవడం లేదని, ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు.
Read More : KCR: దళితబంధు గురించి భలే కవర్ చేసిన కేసీఆర్
కేటీఆర్ పాటించమంటున్నారు..
తన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ అనే కాన్సెప్ట్తో దివ్యాంగులకు వాహనాలు అందించాలని కేటీఆర్ సూచించారు.