KTR Tweet: సామాన్యులకు మరో సారి కేంద్రం భారం వేసింది. వంట గ్యాస్ (LPG Cylinder) ధరను సిలెండర్ పై రూ.50లు పెంచింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు పాలకులపై తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మరో సారి వంట గ్యాస్ ధర ధర పై రూ.50 లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. ఇప్పటి వరకూ రూ.1055 లు ఉండగా దీనికి అదనంగా రూ.50లు పెరగడంతో రూ.1105లకు చేరింది. ఈ చర్యలు సామాన్యులపై పెనుభారం పడుతోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత నెలలో వాణిజ్య వినియోగ గ్యాస్ సిలెండర్ ల ధరలను పెంచింది కానీ గృహ వినియోగ సిలెండర్లపై భారం వేయలేదు. ఇప్పుడు తాజాగా గృహ వినియోగ సిలెండర్ లపై భారం వేసింది. 5 కేజీల సిలెండర్ పై రూ.18లు పెరిగింది. గ్యాస్ సిలెండర్ ధరల పెంపుపై తెలంగాణ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మోడీ పై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. “మంచి రోజులు (అచ్చేదిన్) వచ్చాయి. అందరికీ శుభాకాంక్షలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.50లు పెరిగి..1050లు దాటింది. ఇది అందరికీ మోడీ ఇచ్చిన బహుమతి” అని ట్వీట్ చేశారు.