Robbery: దుండగులు సినీ పక్కీలో కాల్పులకు తెగబడి భారీ దోపిడీకి పాల్పడటం హైదరాబాద్ కూకట్ పల్లిలో తీవ్ర సంచలనం కల్గించింది. కూకట్ పల్లి హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకు ఏటీఎం వద్ద ఈ ఘటన గురువారం జరిగింది. ఏటీఎంలో నగదు రీఫిల్ చేస్తుండగా ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుపై తరువాత ఎటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపారు. వారు తీవ్ర గాయాలపాలై పడిపోవడంతో దుండగులు ఎటీఎంలో రీఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్న నగదును బ్యాగ్ ను తీసుకుని పరారైయ్యారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. పరారైన దుండగుల ఆచూకి గుర్తించేందుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన సెక్యూరిటీ గార్డు, ఏటిఎం సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలా సినీ పక్కీలో తుపాకితో కాల్పులు జరిపి దోపిడీ పాల్పడటం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?