Lock Down: తెలంగాణలో కరోనా కలకలం నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ తెరమీదకు వస్తోంది. థర్డ్ వేవ్ మొదలుకానుందని నిపుణులు హెచ్చరిస్తుంటడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్లు మొదలయ్యాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ విధిస్తూ స్థానికులు నిర్ణయం తీసుకున్నారు.
Read More: Corona: కరోనా థర్డ్ వేవ్ లో డేంజర్ డేస్ ఎప్పుడో తెలుసా?
అప్పటినుంచి మొదలు..
సెకండ్ వేవ్ అనంతరం కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. దీంతో వ్యాపారాలు, మాల్స్, కాంప్లెక్స్లు తెరుచుకుంటున్నాయి. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ ప్రజలు మాస్క్ లు లేకుండా బయటికి రాకూడని అధికారులు చెప్తున్నారు. కానీ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జగిత్యాల వెల్గటూర్ మండలం ఎండపల్లిలో గత రెండు రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందడంతో పాటు.. కరోనా కేసుల సంఖ్య 12కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన గ్రామ పంచాయితీ మరోసారి లాక్ డౌన్ అమలుచేస్తునట్లు ప్రకటించింది.
Read More: Corona: కరోనా థర్డ్ వేవ్ ఎంత డేంజరస్ అనేది మీరు ఇలా తెలుసుకోవచ్చు!
ఇది రూల్స్…
ఎండపల్లిలో గ్రామంలో జూలై 19వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వరకు పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని. ఆ తర్వాత మూసేయాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానులకు 5 వేల రూపాయల జరిమాన విధిస్తామని తెలిపారు. అలాగే గుంపులుగా తిరిగినా, మాస్క్ ధరించకపోయినా వెయ్యి రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఏఎన్ఎంలకు కరోనా రోగుల సమాచారం అందించిన తర్వాతే..ఆర్ఎంపీలు వైద్యం చేయాలని తీర్మానించారు. సామాజిక దూరం పాటించాలని.. గుంపులుగా తిరగొద్దని.. మాస్క్ ధరించాలంటూ అవగాహన కల్పించేలా గ్రామంలో వాల్ పోస్టర్స్ అతికించారు.