Lok sabha: తెలంగాణ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించే రెండు ప్రధాన దిన పత్రికలకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఆ రెండు ప్రధాన పత్రికలకు లోక్ సభ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ప్రముఖ దిన పత్రికలుగా గుర్తింపు పొందిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే లకు లోక్ సభలో అంతర్భాగమైన సభాహక్కులు, నైతిక విలువల విభాగం నోటీసులు జారీ చేసింది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. లోక్ సభ వ్యవహారాలపై తప్పుడు కథనాలు రాయడం ద్వారా సభా హక్కుల ఉల్లంఘనకు, సభ దిక్కారానికి ఈ పత్రికలు పాల్పడ్డాయని ఎంపి అరవింద్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.
Lok sabha: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు వక్రీకరించాయని
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న రాజ్యసభలో ఏపి పునర్విభజనకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మోడీ వ్యాఖ్యలను, సభా వ్యవహారాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వక్రీకరించాయని, తప్పుగా ప్రచురించాయని ఆరోపిస్తూ నిజామాబాద్ బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ ఇటీవల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన స్పీకర్.. సభా హక్కుల కమిటీకి పంపించారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన సభా హక్కుల కమిటీ ఆ రెండు పత్రికలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు 72 గంటల్లో సంబంధిత పత్రికల సంపాదకులు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?