MIM Chief asaduddin: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కేసులు, లాక్ డౌన్ అమలుపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కానున్నది. అయితే కేసులు తగ్గుముఖం పడుతున్నందున మరి కొద్ది రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. నేటి కేబినెట్ భేటీలో కేసిఆర్ ప్రభుత్వం..కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ ఎత్తివేత లేదా పొడిగింపు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, పంటల సాగు, ఇంటింటి జ్వర సర్వే, బ్లాక్ ఫంగస్ కేసు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కేసిఆర్ సర్కార్ కు ట్విట్టర్ వేదికగా కీలక సూచనలు చేశారు.
లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకోవద్దని ఒవైసీ కోరారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదన్నారు. జన సమూహాలను తగ్గించాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి కర్ప్యూ విధించాలని చెప్పారు. కోవిడ్ కేసులు ఉన్న చోట మినీ లాక్ డౌన్ పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజలు కేవలం నాలుగు గంటల లాక్ డౌన్ సడలింపు సయమంలో అన్ని పనులు చూసుకోలేరని పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా కేసులు తగ్గలేదనీ, రాష్ట్రంలో అంతకు ముందు నుంచే కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభం అయ్యిందని అన్నారు. లాక్ డౌన్ కారణంగా చిరు వ్యాపారులు, ప్రజలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Read More: Etela Jamuna: కేసిఆర్ సర్కార్ పై మాజీ మంత్రి ఈటెల సతీమణి జమున తీవ్ర వ్యాఖ్యలు..!!
అధికార యంత్రాంగం మాత్రం లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా వచ్చే నెలాఖరు వరకూ కర్ఫ్యూ, లాగ్ డౌన్ లను కొనసాగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో కేసిఆర్ సర్కార్ ఒవైసీ సూచనలను స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.