Revanth Reddy Vs Malla reddy: తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసిఆర్ సర్కార్ పై చేస్తున్న ఘాటు విమర్శలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల కోసం భూములను మంత్రి కబ్జా చేశారనీ, నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి అసైన్డ్ భూములు కాజేశారంటూ రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి అల్లుడు చెరువునే మింగేశాడనీ, మంత్రి కుటుంబ సభ్యుల అవినీతిపై గ్రామాల్లో దండోరా వేయిస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. పీసీసీ పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేసి రా..మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి వస్తా..ఎవరు హీరోనో ఎవరు జీరోనో తేల్చుకుందాం అంటూ మల్లారెడ్డి తొడగొట్టి మరీ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అందరికీ టైమ్ ఇవ్వడం కాదు. వెళ్లి రాజీనామా చేసి రా..ఇద్దరం పోటీ పడి తేల్చుకుందాం అంటూ మల్లారెడ్డి రేవంత్ కు సవాల్ చేశారు. మల్లారెడ్డి హై పిచ్ కి వెళ్లి అరేయ్ సాలే రేవంత్, అరే గూట్లే అంటూ తిట్ల దండకం అందుకున్నారు. బ్లాక్ మెయిల్ చేయడంలో, బట్టే బాజ్ లో నెంబర్ ఒన్ అయిన రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నానంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మల్లారెడ్డి.
ఒక నాడు తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక నేతలుగా పని చేసిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కత్తులు దూసుకునేలా తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి మల్లారెడ్డి సవాల్ పై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?