హైదరాబాద్ మలక్ పేటలో దారుణ ఘటన జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్ బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. సైదాబాద్ ఊసరబస్తీలో బీహార్ నుండి వలస వచ్చిన కుటుంబం జీవిస్తొంది. ఆ కుటుంబానికి చెందిన పెద్ద కుమార్తె జ్వరంతో ఇంట్లో ఉండగా, చిన్న కుమార్తె ఆరు బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఆ ఇంటి పక్కన పతంగులు ఎగురవేస్తున్న ముగ్గురు బాలురు .. ఆడుకుంటున్న చిన్నారిని డాబా పైకి తీసుకువెళ్లి లైంగికదాడి చేశారు.
చిన్నారి పరిస్థితి గమనించిన స్థానిక మహిళ ఇంటికి వచ్చిన బాలిక తల్లితో విషయం చెప్పింది. దీంతో తల్లి బిడ్డను ఆరా తీయగా విషయం తెలిసింది. బాలిక తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుల్లో ఒకరి వయసు 16 ఏళ్లు కాగా మరొకరి వయసు 11, మరో బాలుడి వయసు 9 సంవత్సరాలు. చిన్నారిని భరోసా కేంద్రానికి తరలించామనీ, నిందితులపై పోక్సో చట్టం తో పాటు అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.