TRS: తెలంగాణ స్థానిక సంస్థలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే, మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఆరు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అధికార టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. అయితే ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు విజయం సాధించినా ఆయనకు రావాల్సిన ఓట్లు రాలేదు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది. టీఆర్ఎస్ నుండి గెలిచిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే ఆ పార్టీ అభ్యర్ధికి ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేశారు అంటే అక్కడి గ్రూపు రాజకీయాలు కారణమా, లేక అధికార టీఆర్ఎస్ పై అసంతృప్తితో క్రాస్ ఓటింగ్ చేశారా అనేది ఆ పార్టీ పోస్టుమార్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
TRS: క్యాంపు రాజకీయాలు నిర్వహించినా…
నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే టిఆర్ఎస్ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంప్ కు తరలించారు. గోవా, బెంగళూరు ప్రాంతాలకు తరలించారు. పోలింగ్ రోజుకు వీళ్లను తీసుకువచ్చారు. అయినప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగింది. మొత్తం 738 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 480, కాంగ్రెస్ పార్టీకి 242 ఓట్లు వచ్చాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో 96 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అభ్యర్ధికి 242 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 150 ఓట్లు అధికార పార్టీ నుండి కాంగ్రెస్ కు పోల్ అయ్యాయి. టిఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ అవ్వడంపై పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. క్రాస్ ఓటింగ్ పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్సీగా గెలిచిన తాతా మధు అంటున్నారు. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు లు గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. వీరి వర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?