Motkupalli Narsimhulu: బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇంకా ఏ పార్టీలో చేరని సంగతి తెలిసిందే. అయితే, ఆయన టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, మోత్కుపల్లి మాత్రం ఆ పార్టీ నేతగానే మాట్లాడుతున్నారు. తాజాగా మీడియాతో ఆయన చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం. బేగంపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ నేత ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. దళితులను అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆయనపై విరుచుకుపడ్డారు.
Read more : KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
ఆ స్కీం గొప్పది అంటున్న మోత్కుపల్లి
70 ఏళ్లలో ఎన్ని పథకాలు వచ్చినా దళితులకు న్యాయం జరగలేదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు పథకం వల్ల అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. దళిత బంధు పథకం.. గొప్ప పథకం అని మోత్కుపల్లి నర్సింహులు కీర్తించారు. ఈ పథకం అమలు కోసం ఎంతైనా ఖర్చు పెడుతామని ఆయన కామెంట్ చేయడం గమనార్హం. హుజురాబాద్ లో దళిత బంధు పై ప్రచారం చేస్తానని, ఈటల రాజేందర్ ను ఓడిస్తానని చెప్పడం మరో ట్విస్ట్. ఈటలకు డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని మోత్కుపల్లి అన్నారు. దళిత ఇండ్ల విషయంలో కూడా ఆలోచన చేస్తామని, ఉద్యోగ కల్పన కోసం 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించడం గమనార్హం. ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూముల దగ్గర ధర్నా చేస్తానని, ఈటల భూముల్లో జెండాలు పాతుతామని చెప్పారు.
Read More : KCR: గుడ్ న్యూస్ః కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న కేసీఆర్, ఎక్కడ, ఎప్పుడంటే….
కేసీఆర్ పై ప్రశంసలు…
దళిత బంధు తో ఎంతో మేలు జరుగుతుందని చెప్పిన మోత్కుపల్లి తన సంపూర్ణ మద్దతు సీఎం కేసీఆర్ కే ఉంటుందని అన్నారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పక్క దారి పట్టకుండా డైరెక్ట్ గా వారి ఖాతా లో వేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. మన కోసం మన జాతి కోసం పని చేస్తున్న నాయకుడు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా దండోరా వేసి ప్రచారం చేస్తానని అన్నారు.