Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ధన ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ హైవే పై రూ.64 లక్షలు పట్టుబడిన కొద్ది గంటల వ్యవధిలోనే హైదరాబాద్ శివారు లోని నార్సింగి వద్ద వాహనాల తనిఖీలో పోలీసులు కోటి రూపాయల నగదు పట్టుకున్నారు. మూడు వాహనాల నుండి ఈ మొత్తం నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డికి చేరవేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.
కోకపేట లెజెండ్ చిమ్స్ విల్లాస్ నుండి ఈ నగదును తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సునీల్ రెడ్డి అనే వ్యాపారి నుండి కోటి రూపాయల నగదు తీసుకుని ఈ నగదును మూడు భాగాలుగా చేసి రెండు కార్లలో రూ.,35 లక్షలు చొప్పున, ఓ బైక్ పై రూ.30 లక్షలు తరలిస్తుండగా నార్సింగి పోలీసులు పట్టుకున్నారు. దేవల్ రాజు, శ్రీకాంత్ సాగర్, విజయ్ కుమార్, దేవులపల్లి నగేష్, దాసరి కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, హర్షవర్థన్ రెడ్డి, సునీల్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Munugode Bypoll: బీజేపీ అభ్యర్ధి డ్రామాలు షురూ అయితాయి జర జాగ్రత్త అంటూ కేటిఆర్ సంచలన కామెంట్స్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?