Nampally Court: గంజాయి అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు నేడు సంచలన తీర్పు ఇచ్చింది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది కోర్టు. రెండు సంవత్సరాల క్రితం పతంగి టోల్ గేట్ వద్ద డీఆర్ఐ అధికారుల వాహనాల తనిఖీలు చేస్తూ 1,427 కిలోల గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.
ఈ గంజాయి విలువ సుమారు 3 కోట్ల 56 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని సీజ్ చేసిన అధికారులు నాడు పేర్కొన్నారు. తుర్పు గోదావరి నుండి ఉత్తరప్రదేశ్ కు భారీ ట్రక్కు లో గంజాయి రవాణా చేస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో ఆనాడు హైదరాబాద్ డీఆర్ఐ అధికారులు పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తూ నదీమ్ ను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?