జాతీయ రాజకీయాల్లో క్రియాశీల భూమికను పోషించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపు (డిసెంబర్ 14న) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ తరుణంలో ఢిల్లీలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఎర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతులు తీసుకోలేదని చెబుతూ కార్పోరేషన్ అధికారులు మంగళవారం తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంత వరకూ స్పందించలేదు.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి గానూ ఢిల్లీకి విచ్చేసిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ..పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు. ఈ రోజు, రేపు యాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు.
KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్
జనసేనాని పవన్ ఎన్నికల వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్ పై రవాణా అధికారి ఇచ్చిన క్లారిటీ ఇది