తెలంగాణ సర్కార్ కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్డీటీ) బిగ్ షాక్ ఇచ్చింది. డిండి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తుండటంపై రూ.900 కోట్లు జరిమానా విధించింది ఎన్జీటీ. నిర్మాణాలను నిలిపివేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడంపై ఎన్డీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తం నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానాను విధిస్తూ ఎన్డీటీ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది.
పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టారని కోస్లి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్డీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఎపి ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఎన్జీటీ .. తెలంగాణ సర్కార్ కు జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తమపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని ఎన్జీటీ పేర్కొంది.
బీజేపీకి దగ్గర అయ్యేందుకే చంద్రబాబు ఖమ్మం పర్యటన .. అటు తెలంగాణ, ఇటు ఏపీ అధికార పక్ష నేతల విమర్శలు