NIA: పేలుడు పదార్ధాల కేసులో ఎన్ఐఏ అధికారులు తెలంగాణలోని అయిదు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ పేలుడు పదార్ధాల కేసులో మహబూబ్నగర్, వరంగల్, జనగామ, భద్రాది, మేడ్చల్ జిల్లాలోని పలువురి నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. మహబూబ్నగర్ లో ముత్తు నాగరాజు, వి సతీష్, మేడ్చల్ లో కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి లో గుంజి విక్రమ్, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్లులో వేలుపు స్వామి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లతో పాటు 400 జిలెటిన్ స్టిక్స్, 549 మీటర్ల ప్యూజ్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మవోయిస్టు నేత హిడ్మకు రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఐఈడీ, గ్రనేట్ లాంచర్ల తయారీకి అవసరమయ్యే సామాగ్రి, పేలుడు పదార్ధాల తయారీకి సంబంధించి పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికాలులు తెలియజేశారు.