హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లే వారికి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెబుతోంది. యు ఎస్ కు నేరుగా నాన్ స్టాప్ విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి మధ్యాహ్నం నుండి షికాగో నాన్ స్టాప్ విమాన సర్వీసులను శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ప్రారంభించనున్నారు.
ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుండి ఎయిర్ ఇండియా విమానం షికాగో బయలుదేరుతుంది. షికాగో నుండి ప్రతి బుధవారం హైదరాబాదుకు మరో విమానం బయలుదేరుతుంది. హైదరాబాదు నుండి యూఎస్ కు నేరుగా నాన్ స్టాప్ సర్వీసు అందుబాటులోకి రావటం ఇదే తొలిసారి. ఎయిరిండియా నాన్ స్టాప్ సర్వీసు ఏర్పాటు చేయడం పట్ల అమెరికా వెళ్లే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నుండి నేరుగా షికాగోకు నాన్ స్టాప్ సర్వీసు ప్రారంభం చేస్తుండటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు, ఎయిరిండియా అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. మరిన్ని నాన్ స్టాప్ విమాన సర్వీసులు ఏర్పాటు చేయడానికి ఇది తొలి అడుగు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విమానం శంషాబాద్ నుండి 14 గంటల వ్యవధిలో చికాగోకు చేరుకుంటుంది.