Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రైనేజీ పైపులైన్ గ్యాస్ లీక్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఘాటైన పొగ పీల్చడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
విషయంలోకి వెళితే …ఎయిర్ పోర్టు డ్రైనేజీ పైపులైన్ లీకేజీ అయ్యింది. దీంతో పైపును సరిచేసేందుకు ముగ్గురు కూలీలు వెళ్లారు. డ్రైనేజీ పైపు శుభ్రం చేసే క్రమంలో పైపులో యాసిడ్ పోశారు. దీంతో ఘాటైన వాసనతో పొగలు వచ్చాయి. ఈ ఘాటైన పొగ పీల్చడంతో కూలీలు అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన నర్శింహరెడ్డి, జాకీర్, ఇలియాస్ లను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నర్శింహరెడ్డి (42) మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు.