భద్రాద్రి కొత్తగూడెం పోడు భూముల గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలోని ఎర్రబోడు సమీపంలో అటవీ రేంజ్ అధికారులపై పోడు భూముల సాగుదారులు (గుత్తికోయలు) కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో అటవీ రేంజర్ (ఎఫ్ఆర్ఓ) శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
అటవీశాఖ నాటిన మొక్కలు తొలగించేందుకు పోడు సాగుదారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అటవీ శాఖ రేంజర్ శ్రీనివాసరావు, బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ రామారావులు అడ్డుకునేందుకు వెళ్లగా గుత్తికొయలు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ప్రాణభయంతో రామారావు పరారుకాగా శ్రీనివాసరావు వారి దాడిలో గాయపడ్డాడు.
Breaking: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఆరుగురు మృతి