MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు పర్వం ప్రారంభం అయ్యింది. మా కార్యాలయంలో సోమవారం ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు నామినేషన్ పత్రాలను అందజేశారు. అధ్యక్షుడుగా ప్రకాష్ రాజ్, ఉపాధ్యక్షులుగా బెనర్జీ, హేమ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, కోశాధికారిగా నాగివీడు, ఈసీి మెంబర్లుగా అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరాజు, ఖయ్యామ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీశ్, టార్జాన్ లు నామినేషన్లు అందించారు.
మరో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవిఎల్ నర్శింహరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు నర్శింహరావు, ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ తో సీవీఎల్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కాగా మంచు విష్ణు ప్యానల్ రేపు మధ్యాహ్నం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 1,2 తేదీల్లో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
MAA Elections: మూడన ప్రణాళిక వెల్లడిస్తామన్న ప్రకాష్ రాజ్
నామినేషన్ల దాఖలు అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ మూడవ తేదీన తమ ప్రణాళిక వెల్లడిస్తామన్నారు. ఇవి సభ్యుల మధ్య జరిగే ఎన్నికలు మాత్రమే కానీ పోటీ కాదన్నారు. ప్రతి విషయంలోనూ తాము ఒక అడుగు ముందే ఉన్నామని నేడు నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు. మా ఎన్నికలలో రాజకీయ జోక్యం వద్దన్నారు. సవ్యంగా దూషారోపణ చేయకుండా ఎన్నికలు జరగాలన్నారు. పవన్ కల్యాణ్ కూడా మా అసోసియేషన్ సభ్యుడేనన్నారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ నాయకుడు, దేశం కోసం పోరాడుతున్నారు, మంచి నాయకుడు, ఆయనకంటూ కొన్ని సిద్దాంతాలు ఉన్నాయన్నారు. ఎవరు ఏమి చెప్పినా మంచి కోసమే మాట్లాడతారని అన్నారు. తమ ప్యానల్ లక్ష్యం మా అభ్యుదయం కోసం పని చేయడమేనన్నారు. గెలిపించేది ఓడించేది సభ్యులేనన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఎన్నికల కంటే మా ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. ఎన్ని వివాదాలు వచ్చినా తామంతా ఒకే కుటుంబమనీ, చలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?