హైదరాబాద్ రామనంతపూర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ గదిలోనే ఓ విద్యార్ధిని వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. నిప్పు అంటించుకున్న ఆ విద్యార్ధిని .. ప్రిన్సిపాల్ ను పట్టుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్ధిని, ప్రిన్సిపాల్ ను కళాశాల యాజమాన్యం గాందీ ఆసుపత్రికి తరలించారు.
ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,