తెలంగాణలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదివారం వర్షాల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనగా, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో మూడు రోజుల పాటు విద్యాసంస్థల పాటు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమ, మంగళ, బుధవారం వరకూ వరకూ పాఠశాలకు సెలవు ఇచ్చారు. గురువారం నుండి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో నిరసనకారుల హాల్ చల్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసిఆర్.. వరదల్లో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్ లను సిద్దం చేశారు. రేపు జరగాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ల సమావేశంతో పాటు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని సీఎం కేసిఆర్ సూచించారు.