Rajya Sabha By election: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేష్ విడుదల అయ్యింది. నేటి నుండి ఈ నెల 19వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. 30న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బండ ప్రకాష్ ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓంబిల్లా ఆమోదించడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.