రేవ్ పార్టీలను నిరోధించేందుకు హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా గుట్టుచప్పుడు కాకుండా అక్కడక్కడా శివారు ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ శివారులో యువకులు ఏర్పాటు చేసుకున్న పార్టీపై పోలీసులు దాడి చేశారు. హయత్ నగర్ మండలం పసుమాములలో ఓ విద్యార్ధి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న వేడుకల్లో గంజాయి వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
పార్టీలో పాల్గొన్న 29 మంది యువకులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సీబీఐటీ, ఎంజీఐటీ కళాశాల విద్యార్ధులుగా గుర్తించారు. వారి వద్ద నుండి గంజాయి, 11 కార్లు, ఒక బైక్, 28 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధులను తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. బుధవారం తిరిగి తమ పిల్లలతో పోలీస్ స్టేషన్ కు ఆదేశించి పిల్లలను వారితో పంపించి వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?