Revanth reddy: మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ బాధ్యతల్లో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ జోష్ తో ముందుకు సాగుతున్న తరుణంలో ఆయనకు పార్టీ సీనియర్ల నుంచే షాకులు తగులుతున్నాయి. వివిధ సభలు, సమావేశాలతో రేవంత్ బిజీ బిజీగా ఉంటుంటే ఆ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో ట్విస్టులు ఇస్తున్నారని చెప్తున్నారు.
Read More: Revanth reddy: కేటీఆర్ను రెండు గంటల పాటు పరేషాన్ చేసిన రేవంత్ రెడ్డి
కోమటిరెడ్డి కలకలం….
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి లో ఆదివాసీల ఆత్మగౌరవ దండోరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తామంటూ ఇంద్రవెల్లి సభ వేదికగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, అనూహ్య రీతిలో ఆ సభను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. మహేశ్వరం నియోజక వర్గంలోకి సభను మారుస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభ అదే తేదీలో మరో చోట జరుగుతుందన్న క్లారిటీ ఇచ్చింది.
Read more : KCR: కేసీఆర్కు ఏకు మేకు అవుతున్న దళితబంధు!
అసలు కారణం కోమటిరెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీన దళిత గిరిజన దండోరా సభ నిర్వహించడానికి కారణం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని అంటున్నారు. ఇబ్రహీంపట్నం సభ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తన పార్లమెంటు నియోజకవర్గంలో సభ నిర్వహిస్తూ తనకు సమాచారం ఇవ్వకుండా సభ ఏర్పాటు చేస్తుండటంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి అలకబూనిననట్టు తెలుస్తోంది. సభ ఏర్పాటుపై కోమటిరెడ్డి అసంతృప్తితో ఉండడంతో ఇబ్రహీంపట్నంలో సభ మార్చేస్తూ మహేశ్వరంకు తరలించారని సమాచారం.