Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ బాధ్యతల్లో దూకుడుగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని రంగంలోకి దింపుతున్నారు. వచ్చే సెప్టెంబరు మొదటి వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందని తాజాగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దళిత దండోరా కార్యక్రమం గురించి రాహుల్ గాంధీతో చర్చించామని.. కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను స్వయంగా వస్తానని రాహుల్ గాంధీ తెలిపారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read More: Revanth reddy: రేవంత్ రెడ్డి ని ఘోరంగా అవమానించిన కేసీఆర్ సర్కారు
రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే..
గాంధీ భవన్ లో హుజురాబాద్ ఉపఎన్నికపై టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, చిన్నారెడ్డి కరీంనగర్ జిల్లా ముఖ్యనేతలు, హుజురాబాద్ ఉపఎన్నికల ఇంచార్జులు పాల్గొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ, అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్ నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయని, నాయకుల సూచనల మేరకు నిర్ణయాలు జరుగుతాయన్నారు. క్షేత్ర స్థాయి లో కలిసి కట్టుగా సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఇప్పటికే మనం ఒక కమిటీ వేసుకొని పని చేసుకుంటున్నామని, నాయకులు చేసే సూచనలు ఖచ్చితంగా పాటించి పని చేయాలన్నారు.
Read More: KCR: కేసీఆర్ ఆశలన్నీ అడియాసలు చేసేసిన కేంద్రం
కోవర్టులు ఉన్నారంటున్న రేవంత్
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా తయారు చేసుకుని కేసీఆర్ రాజకేయ లబ్ది పొందిన విషయాలు మనం చూశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది నాతో సహా.. బాధ్యతాయుతంగా పనులు చేస్తేనే గౌరవం పెరుగుతుంది. మనం అప్రమతంగా ఉండి పని చేయాలి..’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒక రోజంతా రాష్ట్రంలో రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాంతం, తేదీ ఎక్కడ, ఎప్పుడు అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.