Revanth Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఇటీవల నియమితుడైన రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కంటే ముందే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ నేతలను కలుస్తున్నారు. సీనియర్లతో సమావేశం అవుతున్నారు. అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారు. అయితే, ఈ సమయంలో ఆయనకు ఊహించని ఎదురుదాడి ఎదురైంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణలో బలపడాలని చూస్తున్న వైఎస్ షర్మిల పార్టీ నుంచి సదరు విమర్శలు వచ్చాయి.
Read More: Revanth Reddy: రేవంత్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్ … దొంగ అంటూ…
న్యాయం చేసేందుకే ఇలా…
వైఎస్ షర్మిల పార్టీ నేత ఇందిరా శోభన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఇందిరా శోభన్ ఖండించారు. షర్మిల పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు అదే పార్టీలో ఉంటానని, తనను షర్మిల కుటుంబ సభ్యురాలిగా భావిస్తారని పేర్కొన్నారు. పార్టీలో తనకు ఎటువంటి లోటు లేదని, కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్సార్టీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని వివరించారు. తెచ్చుకున్న తెలంగాణ దగా పడింది. అందుకే షర్మిల పార్టీ. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసేందుకే అంతా షర్మిలకు అండగా నిలిచాం’ అని ఇందిరా శోభన్ పేర్కొన్నారు.
Read More: KCR: కేసీఆర్కు ఇంత కులపిచ్చి ఉందా?
రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు…
షర్మిల కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని ఇందిరా శోభన్ తెలిపారు. “నాపై ఒక ప్రముఖ ఛానెల్లో చెత్త కథనాలు వేశారు. సదరు అవాస్తపు కథనాలను ఖండిస్తున్నా. కావాలనే నన్ను ఇబ్బంది పెట్టే కథనాలు ప్రసారం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లకు నా అవసరం ఉంది కాబట్టి వాళ్లు అలా చేస్తున్నారు కావొచ్చు. రేవంత్ రెడ్డికి అవసరం కాబట్టి ఇలా చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే ఊరికే వదిలిపెట్టను. షర్మిలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా. నేను అధికారం కోసం రాలేదు. ప్రజాసేవే నాకు ముఖ్యం.“ అని చెప్పుకొచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?