Revanth reddy: తెలంగాణ కాంగ్రెస్ రథసారథి రేవంత్ రెడ్డి ఊహించని సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? కీలకమైన సమయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని రీతిలో సతమతం అవుతున్నారా? అన్న ప్రశ్న తెరమీదకు వస్తోంది. దీనికి కారణం మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్ ఉపఎన్నిక. ఈ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడం.
Read More: KCR: కేసీఆర్ కు మద్దతిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడమే మిగిలింది
హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో…
హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని వదిలి కమలదళంలో చేరి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఈటల రాజేందర్… పాదయాత్ర తో ఇప్పటికే నియోజక వర్గం అంతా చుట్టేశారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోడానికి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, విద్యార్ధి నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ సత్తా చాటాలని చూస్తోంది. అయితే, ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
Read more: KCR: కేసీఆర్ కు మద్దతిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడమే మిగిలింది
వేట మొదలైంది…
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న మొదటి ఉపఎన్నిక కావడంతో ఎలాగైనా ఆ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అంతా బాగానే ఉన్నా.. ఉప ఎన్నికల్లో నిల్చునే అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీకి సవాలుగా మారింది. అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జనలు పడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో సామాజిక వర్గం, పార్టీ కోసం పని చేసే వ్యక్తి కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీ అభ్యర్థులను బరిలో దింపగా ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పరకాల మాజీ ఎమ్మెల్యే దమ్మాటి సాంబయ్యల పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.