Revanth reddy : కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ పంచాయితీ నడుస్తుండగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ ఎంపిక ఫైనల్ అయిందని.. ఏఐసీసీ నుంచి ప్రకటన కూడా వస్తుందన్న హడావుడి నేపథ్యంలో గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఎవరికీ వారు లాబీయింగ్ చేస్తున్నారు. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. అయితే, పీసీసీ రథసారథి ఎవరో ఎటూ తేలడం లేదు. ఈ సమయంలోనే ఓ ముఖ్య నేత తాను రేసులో లేనంటూ ప్రకటించేశారు.
Read More: KCR: కేసీఆర్ భారీ కల… అడ్డం పడుతున్న కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీలో ఏం జరుగుతోంది?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు , పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు పీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టిందని టాక్ వస్తోంది. ఇటీవల మారుతున్న పరిణామాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. పీసీసీ పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, మధుయాష్కీ పేర్లు ప్రముఖంగా వినిస్తున్నాయి. అయితే ఆశావాహులు హస్తినలోనే ఉండి ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read More : KCR: కేసీఆర్… జగ్గారెడ్డి అనే వీరాధివీరుడి గురించి నీకు తెలుసా?
అబ్బే నేను పదవి ఆశించట్లే…
పీసీసీ అధ్యక్షుడి నియామకంపై మాజీ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పీసీసీ ఛీఫ్ అనేది ఏఐసీసీ పరిధిలోని అంశమని.. తాను ఆ రేసులో లేనని పేర్కొన్నారు. తనకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదని తెలిపారు. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని శ్రీధర్ బాబు తెలిపారు. పీసీపీ ఛీఫ్ ఎవరికి ఇవ్వాలన్నది ఏఐసీసీకి తెలుసు అని తెలిపారు. దీంతో రేసులో నుంచి ఒక నేత తప్పుకున్నట్లు అయిందని పలువురు చర్చించుకుంటున్నారు.