Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ కలహాల కుంపటిలో ఎన్నో వివాదాల నడుమ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన దైన శైలిలో ముందుకు సాగుతూ కొంత వరకు సక్సెస్ అవుతున్నట్లే ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక ఐపోయింది, ఇక భవిష్యత్తు లేదు, రాదు అనుకున్న చాలా మంది నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రులుగా కూడా అయ్యారు. ఎమ్మెల్యేలతో సహా మండల స్థాయి నాయకులు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కొందరు బీజేపీలో చేరారు. 2014 నుండి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పెద్దగా లేరు. కొద్ది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆ తరువాత కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు.
Read More: Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రాజకీయ కుటుంబ కథా చిత్రం..! జిల్లాలో ఇదే హాట్ టాపిక్..!!
అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడుగా నియమితులైనప్పటి నుండి ఆ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. తొలుత రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నాయకులలో కొందరు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ రేవంత్ తో కలిసి ప్రయాణం చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నారుట. మరో పక్క రేవంత్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే వివిధ కారణాలతో గతంలో పార్టీ నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి రావాలంటూ కూడా ఆహ్వానించారు. రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ ను రేవంత్ స్టార్ట్ చేసినట్లు కనబడుతోంది. ఈ క్రమంలోనే టిఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టాక్.
ఎంపి కొండా విశ్వశ్వరరెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్లో వైపు రావడానికి సంసిగ్దత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు, బీజేపీ ఎంపి అరవింద్ సోదరుడైన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కూడా ఇటీవల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రేస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భూపాల్పల్లి ప్రాంతంలో బలమైన నాయకుడైన గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీలో చేరికలు లేని పరిస్థితి ఉండగా, ఇప్పుడు రేవంత్ నేతృత్వంలో చేరికలు ప్రారంభం అవుతుండటం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో కొంత వరకూ జోష్ వస్తున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?