Revanth Reddy: ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా నియామకం విషయంలో అనేక ట్విస్టులు చోటు చేసుకోవడం, ఎట్టకేలకు నేడు ప్రమాణ స్వీకారం పూర్తయిపోవడం తెలిసిన సంగతే. తనకు పదవి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పలువురు నేతలను కలిసిన రేవంత్ ఈ మేరకు వారితో చర్చలు జరిపారు. రేవంత్ విషయంలో అసంతృప్తి తెలిపిన వారి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరు. అయితే ఈ నియమాకంపై తాజాగా జగ్గారెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నాడు అంటే, సోనియా.. రాహుల్ గాంధీలు ఉన్నట్టేనని తెలిపారు.
Read More: Revanth reddy: అన్ని లెక్కలు చూసుకున్న తర్వాతే… నేడు అరంగేట్రం చేస్తున్న రేవంత్
జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు…
పదవి కోసం పోటీ పడటం సహజమని.. నిర్ణయం అయిపోయింది కాబట్టి, పార్టీని అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి కృషి చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. వ్యక్తిగత అభిప్రాయం ఏది ఉన్నా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, సోనియాగాంధీ ఆదేశాల మేరకు కలిసి పని చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. తాము కొట్లడుడు బంద్ చేసి.. ఇక ప్రభుత్వం మీద కొట్లాడుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తానని, వీలైతే పాదయాత్ర చేయాలని ఆలోచన ఉందని తెలిపారు. పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
Read More: Revanth Reddy: రేవంత్ పై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నది ఎవరో తెలుసా?
ఐస్ చేసేసిన రేవంత్
ఇక రేవంత్ విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేలా ఐక్యంగా పని చేస్తామన్నారు. కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు ఇక నుంచి తావు లేదని చెప్పారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై ఇంకా కేసులు ఎత్తేయలేదని విమర్శించారు. తమ కుటుంబాలను వదిలేసి, రెండేండ్లు ప్రజల కోసం పని చేసే విధంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.