Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలుకొని సంచలన వ్యాఖ్యలతో, ఘాటు నిర్ణయంఆలతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా పార్టీ నేతలకు సైతం ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. అయితే, పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లనున్నట్లు వచ్చిన వార్తుల మరింత సంచలనంగా మారాయి. దీనిపై రేవంత్ స్పందించారు. ఇదే సమయంలోనే ఆయన సంచలన కామెంట్లు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యవహారం తనకు ముందే తెలుసని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా కాంగ్రెస్లో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిని వదలబోమని వార్నింగ్ ఇచ్చారు.
Read More: Revanth Reddy: కాంగ్రెస్లో శత్రువులను పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి
ఆ విషయం ముందే తెలుసంటున్న రేవంత్
తమకు కౌశిక్ రెడ్డి వ్యవహారం ముందే తెలుసని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. “ కౌశిక్ టీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడని మాకు సమాచారం వుంది. కౌశిక్ చిన్న పిల్లగాడు. ఇప్పుడు కౌశిక్ మాట్లాడుతున్నవి సొంత మాటలు కాదు. కేసీఆర్ మాట్లాడించిన మాటలు. అక్కడ కౌశిక్కు టిక్కెట్ ఇస్తారని అనుకోవడం లేదు. టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నా.. వారికి అభ్యర్థే కరువయ్యాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారు. హుజూరాబాద్లో మా అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పం.ఉత్తగనే గాంధీభవన్లో బాతాఖానీ కొట్టే వాళ్లు అవసరం లేదు. హుజూరాబాద్లో దమ్మున్న నాయకుడ్నే బరిలో దించుతాం.“అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Read More: Revanth Reddy: ఇటు కేటీఆర్ను అటు కిషన్ రెడ్డిని కెలికిన రేవంత్
వాళ్ల గురించి మళ్లీ అదే మాట..
ఇంటి దొంగల విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేదని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎవ్వరైనా సరే కోవర్టులుగా ఉంటే వారి తీరు మార్చుకోవాల్సిందే. సిగరెట్ తాగడం వద్దని డాక్టర్ చెబితే వినాలిగా.. ఇది కూడా అంతే. పార్టీకి నష్టం వాటిల్లే పని ఎవరూ చేయొద్దనేది నా ఆలోచన’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?