Revanth Reddy: మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన డైనమిజంతో తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా నియమితుడైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ కు ఈ పగ్గాలు అప్పగించగా ఆ గేమ్ ప్లాన్తో పాటుగా మరిన్ని వ్యూహాలు సైతం అమలు చేస్తూ రేవంత్ ముందుకు సాగుతున్నారు. పీసీసీ ఛీప్ బాధ్యతల స్వీకరణ కంటే ముందే తన గేమ్ మొదలుపెట్టారని అంటున్నారు. దీనికి ఆయన ప్రమాణ స్వీకారం వేదిక కానుందని చెప్తున్నారు.
Read More: Revanth Reddy: అప్పుడే గ్రూపు రాజకీయాలు చేస్తున్న రేవంత్
రేవంత్ ఆ విషయంలో …
తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి జూలై 7, 2021 బాధ్యతలు స్వీకరిస్తారు. ఉ:10 గంటలకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందుకొని, ప్రజాభివందనం చేస్తూ, నాంపల్లి దర్గ మీదుగ గాంధీ భవన్ చేరుకుంటారు. మ:12:00 గంటల నుంచి బాధ్యతల స్వీకారం కార్యక్రమం ఉంటుంది. అయితే, ఈ సమయంలో భారీ ఎత్తుగడకు సైతం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని సమాచారం. భారీ జన సమీకరణకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని జులై 7న బాధ్యతల స్వీకరణకు లక్ష మంది విచ్చేసేలా చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంతోనే తన సత్తా ఏంటో చాటుకోనున్నట్లు చెప్తున్నారు.
Read More: Revanth Reddy: రేవంత్ దూకుడు మొదలైందిగా… అప్పుడే కేటీఆర్ విషయంలో…
ఇప్పటికే ఆ పనిలో ఉన్న రేవంత్
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ ప్లాన్ ఏంటి.. వ్యూహాలు ఏంటన్నది కూడా ఉత్కంఠను రేపుతోంది. తనది కాంగ్రెస్ కుటుంబమని, తాను సోనియా గాంధీ మనిషినని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ను ఎదుర్కునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రావణాసురుడ్ని ఎదుర్కోవడానికి వానర సైన్యం ఎలా పని చేసిందో.. కేసీఆర్ను దించడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అదే విధంగా పని చేయాలన్నారు. అయితే, రేవంత్ నియామకం తర్వాత కొందరు నేతలు తమ అసంతృప్తిని వినిపించారు. రేవంత్ను కలవని, తనకు వ్యతిరేక స్వరం వినిపించిన నేతలను, కినుక వహించిన వారిని నేరుగా కలుస్తూ పార్టీ బలోపేతానికి సహకరించాలని, కాంగ్రెస్ పునరేకీకరణకు కలిసి రావాలని పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. ఇలా నేతలను దారికి తెచ్చుకోవడం అటు తన బలం చూపించుకోవడం ఎజెండా ఈ యువనేత ముందుకు సాగుతున్నట్లు సమాచారం.